నకిలీ బంగారు బిస్కట్స్ ను అసలు బంగారు బిస్కట్స్ నమ్మించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 3 సభ్యుల ముఠా ను SOT బాలానగర్ టీం మరియు జీడిమెట్ల పోలీసులు పట్టుకుని వారి వద్దనుండి 100 నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనడానికి 27 లక్షలు సమకూర్చుకుని వచ్చిన వారు కూడా వారితో ఉన్నారు. అదే సమయంలో SOT పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకోడం తో కొనడానికి వచ్చిన బాధితులు పెద్ద మొత్తం లో డబ్బు పోకుండా రక్షించినదుకు SOT పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలకు పలుపడ్డారని ఈ ముఠా ఇంకా ఎంతమందిని మోసం చేశారఅనే కోణం లో సైబరాబాద్ SOT పోలీసులు దర్యాప్తు చేపట్టారు.