News
శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలి
కర్నూలు జిల్లా ఆదోని లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎన్నికల అనంతరం హింసను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఖండించారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షణభంగురమైన ఈ జీవితాన్ని అంకితం చేయాలి తప్ప కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాల కోసం కాదు అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష నాయకులు సంయమనం పాటిస్తూ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయాలని పిలుపునిచరు. పోలీసు శాఖ కూడా నిఘా విభాగాల సమాచారం ఆధారంగా గొడవపడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికలు ముగిసినందున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక ప్రతి ఒక్కరూ రాజకీయాలకు కతీతంగా పని చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విన్నవించారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




