News
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి
2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్, హనవళు గ్రామ సచివాలయల ముందు ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ..
ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చిందని మరికొంతమందికి నష్టపరిహారం ఇవ్వలేదని తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు వల్ల నష్టపోయిన రైతులకు కంపెనీల నుంచి రావలసిన ఇన్సూరెన్స్ ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని తక్షణమే ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలిపారు. మండలంలో ఉపాధి హామీ వేతనాలు 10 వారాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని మరియు 200 రోజులు పని దినాలతో పాటు 600 రూపాయలు వేతనం వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు ఎలాంటి కండిషన్ లేకుండా ఇవ్వాలని బ్యాంకుల ద్వారా రుణాలు మరియు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించాలని కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు భాష, హనుమంత్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గోవిందు, అబ్దుల్ రహీం, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కృష్ణ గోవిందరెడ్డి రమేష, కొండయ్య, వై.తాయన్న, s. తాయన్న, మరియు పాండవుగల్, గనేకల్,హనవాళ్ గ్రామాల రైతులు, కూలీలు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




