News
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి
2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్, హనవళు గ్రామ సచివాలయల ముందు ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ..
ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చిందని మరికొంతమందికి నష్టపరిహారం ఇవ్వలేదని తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు వల్ల నష్టపోయిన రైతులకు కంపెనీల నుంచి రావలసిన ఇన్సూరెన్స్ ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని తక్షణమే ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలిపారు. మండలంలో ఉపాధి హామీ వేతనాలు 10 వారాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని మరియు 200 రోజులు పని దినాలతో పాటు 600 రూపాయలు వేతనం వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు ఎలాంటి కండిషన్ లేకుండా ఇవ్వాలని బ్యాంకుల ద్వారా రుణాలు మరియు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించాలని కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు భాష, హనుమంత్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గోవిందు, అబ్దుల్ రహీం, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కృష్ణ గోవిందరెడ్డి రమేష, కొండయ్య, వై.తాయన్న, s. తాయన్న, మరియు పాండవుగల్, గనేకల్,హనవాళ్ గ్రామాల రైతులు, కూలీలు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
