Connect with us

News

రోడ్లపై పశువులను వదిలితే క్రిమినల్ చర్యలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు కారణమైన పశువుల యజమాను లు బాధ్యత రహితంగా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లపై అడ్డంగా పడుకున్న పశువులు

మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు పశువుల యజమానులకు అనేకసార్లు సమావేశములు ఏర్పాటు చేసి వారి పశువులను రోడ్లు మీదకు వదలకుండా జాగ్రత్తలు తీసుకొనవలని హెచ్చరించిన పశువుల యజమానులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పశువులను యధేచ్చగా రోడ్ల మీదకు వదలటం జవాబుదారీతనం లేకపోవడం వలన యాక్సిడెంట్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం, ఆదోని పురపాలక సంఘము యంత్రాంగం ఆదేశాముల మేరకు పశువులు రోడ్లపై కనబడితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా పశువులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులపై పశువుల యజమానులకు ఎటువంటి హక్కులు వుండవని తెలిపారు. పశువుల యజమానులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పశువులు
రోడ్డుకు అడ్డంగా పడుకున్న పశువులు
అధికారులు జారీ చేసిన పత్రిక ప్రకటన

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending