News
పేదల కోసం అనేక సంక్షేమ అందించిన ఏకైక నాయకుడు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి కార్యక్రమం వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి నివాళులర్పించరు. ఏరియా హాస్పిటల్ లలో పాలు బ్రెడ్లు పండ్లు రోగులకు అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యకు పెద్దపీట వేసి ప్రోత్సహించారని ఆరోగ్యశ్రీ అనే సంక్షేమ పథకాన్ని పెట్టి ప్రతి పేదవానికి వైద్యం అందుబాటులో తెచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేవా, చైర్ పర్సన్ బోయ శాంత, సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




