News
గుడి ఆవరణంలో అక్రమంగా నిర్మించిన గుడిసెను తొలగించండి
గుడి ఆవరణంలో అక్రమంగా గుడిసె వేసుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తు గుడికి భక్తులు రాకుండా చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించాలని డీఎస్పీ సబ్ కలెక్టర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన గుడి పీఠాధిపతి..
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం దక్షిణ సింహద్వారం ముందు గుడి పరిసరాలలో శ్రీమతి బోయ పార్వతి అనే మహిళ అక్రమంగా గుడిసెను వేసుకొని గుడి మహాగోపురం ద్వారానికి అడ్డంగా కాలకృత్యాలు చేస్తూ దేవస్థానానికి వచ్చి భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తుంది అని, ఈ మహిళ ప్రవర్తన వల్ల దేవస్థానం పవిత్ర వాతావరణం దెబ్బతింటుందని, దేవస్థానం అపవిత్ర కాకుండా కాపాడాలని అధికారులకు కోరుతూ విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు అశోక్, నగర అధ్యక్షులు అడివేస్ మరియు శ్రీ అనంత మంగళాంజనేయస్వామి ప్రెసిడెంట్ వీరన్న గౌడ్, వీరేశ్, యువరాజ్, శ్రీకాంత్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అధికారికి మరియు సబ్ కలెక్టర్ కు ఎమ్మార్వో కు రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
