కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో జయ మనోజ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా భీమాస్ సర్కిల్ శ్రీనివాస్ భవన్ మీదుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయం మనోజ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలతో అలంకరించారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కు తోడుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు.