News
అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి
కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం వల్ల బయటకు పోవటం చాలా ఇబ్బందికరముగా మారి అవతల అగ్నిప్రమాద స్థలానికి చేరడానికి ఆలస్యం అవుతోంది. కావున అగ్నిప్రమాద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది అని తెలిపారు. గతంలో మునిసిపల్ కమీషనర్ రామలింగేశ్వర్ ఇక్కడ సిమెంటు రోడ్ వేయటానికి ప్రతిపాదన సిద్ధం చేసినా పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయాలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


