News
మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన.. ఎస్ఎఫ్ఐ
కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమె నడపాలని డబ్బులు లేవంటే బిక్షాటన చేసి సిగ్గులేని ప్రభుత్వానికి మేము ఇస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు
తెలిపారు.

1. రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ
రాజధాని కోసం కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఖర్చు చేస్తుంది అదే పేద మధ్యతరగతి వారికి ప్రాణదాత అయిన మెడికల్ కాలేజ్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావడానికె ఈ బిక్షం ఎత్తుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతి ఇంటికి ప్రతి చోటికి వెళ్లి బిక్షాటన చేస్తామని ఆ వచ్చిన డబ్బులు ప్రభుత్వానికి పంపిస్తాం అప్పుడైనా నిర్మాణం పూర్తి చేయండి సిగ్గులేని సీఎం రాష్ట్రాన్ని బిక్షం ఎత్తుకునే పరిస్థితిని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందేలా 17 మెడికల్ కాలేజీలో ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేసి డబ్బులు లేవని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని కావాలంటే బిక్షాటన చేసి డబ్బులు ఇస్తామని అప్పుడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నడపాలని కోరారు.


News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


-
News4 days agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News2 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News20 hours agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News1 week agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
