News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


News
పత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కర్నూలు లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ ఎస్. ఏం. డి. గౌస్ సోమవారం 24 వ తేదీ న పత్తి వ్యాపారుల కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు వరుసగా కోడుమూరు మండలం వర్కూరు గ్రామం లో హెచ్. హనుమంతు, ఎమ్మిగనూరు ప్రాంతంలోని షేక్షావల్లి కాటన్, ఈరన్న ఫుడ్ గ్రెయిన్స్, గౌస్ కాటన్ ట్రేడర్స్, గిడయ్య కాటన్, ఆశా ట్రేడర్స్, HKGN కాటన్ మర్చెంట్, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ (కర్నూల్ రోడ్, ఎమ్మిగనూరు) లో జరిగినవి. ఈ తనిఖీలలో పలువురు వ్యాపారులు వినియోగిస్తున్న తూకపు యంత్రాలకు రీస్టాంపింగ్ గడువు పూర్తయ్యినట్టు గుర్తించడమే కాకుండా, 10 కేజీల తుకనికి 1,200 గ్రాములు తక్కువగా చూపిన ఘటనలు నమోదైనవి. ఈ నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 సెక్షన్ 8/25 మరియు 30 ప్రకారం 2 కేసులు నమోదు చేసి, రూ. 35,000 జరిమానా విధించారు. రైతులకు కాటన్ కొనుగోలు తూకా విధానంపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా ప్రతీ వ్యాపారుడు తాను వాడుతున్న తూకపు యంత్రాలను లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా సరిచూసుకుని, వెరిఫికేషన్ సర్టిఫికేట్ వ్యాపారం వద్ద ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సూచించారు. లీగల్ మెట్రాలజీ శాఖ ముద్ర సర్టిఫికేట్ లేని యంత్రాలు వాడితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు, రైతులు తూకపు యంత్రాలపై శాఖ ముద్ర ఉందా అని చూసుకోవాలని తెలిపారు. వరుసగా తనిఖీలు కొనసాగిస్తామని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్టర్ ఎస్ ఎం డి గౌస్ తెలియజేశారు.

-
News1 week agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News3 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News6 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 weeks agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
