News
ఆదోని అభివృద్ధి కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే పార్థసారథి
ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు
కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీలో పర్యటిస్తూ పలు జాతీయ నాయకులతో కలసి అభివృద్ధిపై చర్చలు చేసి తమ వంతు సహాయపడాలని కోరారు. జాతీయ నాయకులు ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి నీ వెంటే ఉన్నామని తెలిపినట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. ఆదోని ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం సహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పార్థసారథి ధిమా వ్యక్తం చేశారు.







News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
