News
చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత కార్మికులకు వైయస్సార్ నూతన నేస్తం పథకం ద్వారా రూ. 24 000/- చొప్పున ఐదు సంవత్సరాలుగాను రూ 1.20 వేలు అందించడం జరుగుతుంది గత చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినాడు గత రాజశేఖర్ రెడ్డి హయం నుంచి నిరుపేద చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు మంజూరు చేయించి పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, చేదోడు వైయస్సార్ చేయూత అన్ని పథకాల కూడా నేరుగా డబ్బులు వారి అకౌంట్లోనే వేయడం జరుగుతుంది అని తెలిపారు. 2024 లో కూడా కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇది ప్రజల ప్రభుత్వం అలాగే ఆదోనిలో టీడీపి నిరుద్యోగ నాయకులు టిడ్కో గృహాలపై విమర్శలు చేయడం సరికాదు మొదటి విడత టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ తాళాలు అప్పగించడం జరిగింది త్వరలో చిన్నపాటి సమస్యలు ఉన్న సర్దుబాటు చేసి గృహాలకు చేరుస్తాం కచ్చితంగా నా ఆదోని ప్రజలకు గృహాలను అప్పగించి తీరుతా నా ఆదోని ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నారు. ఈరోజు చేనేత కార్మికులకు మగ్గం వేయడానికి యంత్ర పరికరాలను అప్పగించడం జరిగింది త్వరలో చేనేత కార్మికులకు 3 సెంట్లు నివాస స్థలమును ఇవ్వడానికి కృషి చేయాలని కలెక్టర్ కు విన్నపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, చేనేత శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జి.రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తాసిల్దార్ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
