Connect with us

News

చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత కార్మికులకు వైయస్సార్ నూతన నేస్తం పథకం ద్వారా రూ. 24 000/- చొప్పున ఐదు సంవత్సరాలుగాను రూ 1.20 వేలు అందించడం జరుగుతుంది గత చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినాడు గత రాజశేఖర్ రెడ్డి హయం నుంచి నిరుపేద చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు మంజూరు చేయించి పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, చేదోడు వైయస్సార్ చేయూత అన్ని పథకాల కూడా నేరుగా డబ్బులు వారి అకౌంట్లోనే వేయడం జరుగుతుంది అని తెలిపారు. 2024 లో కూడా కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇది ప్రజల ప్రభుత్వం అలాగే ఆదోనిలో టీడీపి నిరుద్యోగ నాయకులు టిడ్కో గృహాలపై విమర్శలు చేయడం సరికాదు మొదటి విడత టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ తాళాలు అప్పగించడం జరిగింది త్వరలో చిన్నపాటి సమస్యలు ఉన్న సర్దుబాటు చేసి గృహాలకు చేరుస్తాం కచ్చితంగా నా ఆదోని ప్రజలకు గృహాలను అప్పగించి తీరుతా నా ఆదోని ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నారు. ఈరోజు చేనేత కార్మికులకు మగ్గం వేయడానికి యంత్ర పరికరాలను అప్పగించడం జరిగింది త్వరలో చేనేత కార్మికులకు 3 సెంట్లు నివాస స్థలమును ఇవ్వడానికి కృషి చేయాలని కలెక్టర్ కు విన్నపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, చేనేత శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జి.రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తాసిల్దార్ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading

News

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

Published

on

ఆదోని 08 మే 2026

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

అర్హతలు మరియు నిబంధనలు:

భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

సబ్సిడీ వివరాలు:

SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.

Ai image

ఎంపిక మరియు చెల్లింపు విధానం:

రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన గడువు తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.

Continue Reading
News12 hours ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News2 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News3 weeks ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News3 weeks ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News1 month ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News2 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

News3 months ago

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

Trending