Connect with us

News

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

Published

on

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.
96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:
నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.
8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.
11.55 – తంగడంచలో భోజన విరామం
సాయంత్రం
4.00 – తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – జూపాడుబంగ్లాలో తాండవ సామాజికవర్గీయులతో సమావేశం.
4.50 – ఎబిఎన్ చర్చిలో క్రిస్టియన్లతో సమావేశం.
5.10 – తాటిపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
5.50 – తరిగొప్పుల క్రాస్ వద్ద బిసిలతో సమావేశం.
6.15 – బన్నూరు వద్ద స్థానికులతో సమావేశం.
6.40 –బన్నూరు శివారు విడిది కేంద్రంలో బస.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరణ.

నంద్యాల జిల్లా. 10వ తేదీ కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర బుధవారం 95వ రోజుకు చేరుకుంది.  నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకం.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా  నారా లోకేష్
అల్లూరులో హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి హామీ ఇస్తూ  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నందికొట్కూరు బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ గారు పేదలు తమ గళం వినిపించే వేదిక యువగళం అని అన్నారు

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తి.

News

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

Published

on

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో పూజకు వెళ్తున్న ఫోటో

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి,  చీరలతో  సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం  ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.  చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి  కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.

కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తాన్న ఫోటో
రథి మన్మధుల దేవుళ్ల
Continue Reading

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Trending