Connect with us

News

నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

Published

on

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.
94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:
కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)
సాయంత్రం
3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.
3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.
3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.
3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో సమావేశం.
4.00 – మిలటరీ కాలనీలో ఈడిగలతో సమావేశం.
4.20 – మిలటరీ కాలనీ శివార్లలో స్థానికులతో సమావేశం.
4.55 – మిలటరీకాలనీ శివార్లలో పడిదంపాడు గ్రామస్థులతో సమావేశం.
5.45 – గార్గేయపురంలో స్థానికులతో మాటామంతీ.
6.10 – గార్గేయపురం దేవాలయం రోడ్డులో స్థానికులతో సమావేశం.
6.25 – రైస్ మిల్లు రోడ్డులో మైనారిటీలతో సమావేశం.
7.15 – హంద్రీకాల్వ వద్ద తాండ్రపాడు గ్రామస్థులతో సమావేశం.
7.40 – గార్గేయపురం శివారు విడిది కేంద్రంలో బస.


News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 14.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 14 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.75 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 89.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 27897 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 25197 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 4665 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 88396 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

Published

on

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో

​కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ (RDO) కె. అరుణాదేవి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ నయూమ్, అసిస్టెంట్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది, బీజేపీ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 26834 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 23290 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 2266 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.852 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending