News
నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.
94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:
కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)
సాయంత్రం
3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.
3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.
3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.
3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో సమావేశం.
4.00 – మిలటరీ కాలనీలో ఈడిగలతో సమావేశం.
4.20 – మిలటరీ కాలనీ శివార్లలో స్థానికులతో సమావేశం.
4.55 – మిలటరీకాలనీ శివార్లలో పడిదంపాడు గ్రామస్థులతో సమావేశం.
5.45 – గార్గేయపురంలో స్థానికులతో మాటామంతీ.
6.10 – గార్గేయపురం దేవాలయం రోడ్డులో స్థానికులతో సమావేశం.
6.25 – రైస్ మిల్లు రోడ్డులో మైనారిటీలతో సమావేశం.
7.15 – హంద్రీకాల్వ వద్ద తాండ్రపాడు గ్రామస్థులతో సమావేశం.
7.40 – గార్గేయపురం శివారు విడిది కేంద్రంలో బస.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
