బిసిలపై దాడి చేసిన అగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర డిమాండ్ చేశారు. పోలం విషయంలో కురువ మల్లేష్, కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ కురువ సామాజిక వర్గానికి చెందినవారు పొలం విషయంలో అగ్రవర్ణాలకు చెందిన సంజీవరెడ్డి, బాలు రెడ్డి, అర్జున్ రెడ్డి, రాఘవరెడ్డి, రామకృష్ణ రెడ్డి తదితరులు కొడవళ్లు, రాడ్లు, కర్రలతో దాడి విశాలని ఆరోపించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ ని కోరారు.