పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న ఇన్చార్జి సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో ఆదోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
  1. ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన వీరేష్ సంబంధించి సర్వేనెంబర్ 89 నందు 4.50 ఎకరాల భూమిలో 4.50 సెంట్ల భూమిలో గత పది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నాము. ప్రస్తుతం మా ఇంటి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమణ
    చేసి రోడ్డు మార్గం లేకుండా చేశారు. దయతో విచారం చేసి న్యాయం చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
  2. హోళ గుంద మండలం గజ్జహల్లి గ్రామంలో సర్వేనెంబర్ 354 /ఏ నందు 1.00 ఎకరా విస్తీర్ణం కొనుగోలు ద్వారా సంక్రమించినది. ప్రస్తుతం మా తండ్రి గారు చనిపోయిన తరువాత నా యొక్క పేరు మీద రిజిస్టర్ చేయడానికి వెళ్ళగా సదరు భూమి ఆన్లైన్ నందు దేవాదాయ శాఖ భూమిగా ఉన్నది దయతో విచారణ చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు.
  3. ఆదోని మండలం నాగనాతహళ్లి గ్రామానికి చెందిన రంగయ్య సంబంధించి సర్వేనెంబర్ 583 నందు 2.05 ఎకరాల విస్తీర్ణం భూమి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదు అయినది దయతో విచారణ చేసి నా యొక్క పేరును నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
  4. ఆదోని మండలం ఆరెకల్ గ్రామం అయ్యప్పకు సంబంధించి సర్వేనెంబర్ 147 నందు 2.40 ఎకరాల భూమి మా పెద్దల నుండి సంక్రమించినది. ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు నమోదు కాలేదు దయతో ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న ఇన్చార్జి సబ్ కలెక్టర్

ఇంకా ఈ కార్యక్రమంలో 49 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలన్నీ గడువు లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డి.ఎస్.పి శివ నారాయణస్వామి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, డి ఎల్ పి ఓ నూర్జహాన్ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్టీవో నాగేంద్ర, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిడిపిఓ ఉమామహేశ్వరి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్న ఇన్చార్జి సబ్ కలెక్టర్ ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *