విద్యుత్ సరఫరాలో అంతరాయం
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.