రామజలలో భారీ చెట్టు పడి పైప్లైన్ ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు […]

17 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు సుమారు 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఇంకా 6 మంది పేకాట రాయుళ్లు పరారైనట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

నందమూరి తారకరామారావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

రాజధాని అమరావతిలో సీఎం పర్యటన

అమరావతి : రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని నిర్మాణాలు, భవన సముదాయాలను పరిశీలించరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ లో నిర్మాణం పూర్తి అయిన గదులను చూశారు సీఎం చంద్రబాబు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని ప్రశ్నించరు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్నరు. అధికారు ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడి మాట్లాడుతూ క్వాలిటీ మెటిరీయల్ వాడడం వల్ల చెక్కుచెదరలేదన్నరు. ప్రజా ప్రతినిధుల […]

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

అమరావతి: 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ప్రభుత్వం.ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు.

పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా 21 వేల మంది రైతులకు పెట్టుబడి సహాయం

పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామం లో పీఎం కిసాన్ సమాన్ నిధి కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి 17వ విడత ప్రారంభ […]

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్, అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప, పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్యాగులను పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం పదవ తరగతిలో అత్యధిక […]

రాత్రి 8 దాటితే చర్యలు.. హోమ్ మినిస్టర్ అనిత

విశాఖపట్నం: హోమ్ మిస్టర్ అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైజాగ్ లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒరిస్సా నుండి వైజాగ్ కి రావడానికి మూడు చెక్పోస్టులు మాత్రమే ఉన్నాయంటే ఎంత దారుణ పరిస్థితి అన్నారు అమెజాన్లో కూడా కరీ లీవ్స్ అని పేరు పెట్టుకుని గంజాయిని నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలంటే టాస్క్ ఫోర్ ఏర్పాటు చేసి రాత్రి 8 దాటితే గుంపులు గుంపులు గా కనిపిస్తే […]

ఈ నెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ YS.జగన్‌ అధ్యక్షతన ఈ నెల 19న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి MLA లతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు. వీరితో పాటు MP లు మినహా పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Back To Top