కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాడి సచివాలయం సమీపంలో కురువ గులెప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి మంటలను ఆర్పి అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..కంబలదిన్నె గ్రామానికి చెందిన కురువ గులెప్పగా పోలీసులు గుర్తించామని తెలిపారు. అయితే ఇంకా […]
ఆటో లారీ ఢీ ఏడు మందికి గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ పై కొట్టల సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న అయిదు మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.ఆదోని లో బందువులు ఇంటికి వెళ్లిన సొంత గ్రామమైన పెద్దకడుబుర్ మండలం చిన్నతుంబళం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అన్వర్ భాష , రేష్మ , రేష్మ బాను, తహేర్ భాషకు గాయాలు కాగా […]
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. […]
వేరు వేరు స్కూటర్ ప్రమాదాలలో ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా: వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.కోసిగి సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయ (20 సం) అనే యువకుడు స్కూటర్ అదుపుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వ […]
బన్ని ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవర గట్టు లో శనివారం జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. పత్తికొండ ఆర్డీవో, డి ఎస్ పి మరియు సంబంధిత అధికారులతో కలసి పార్కింగ్, సి.సి. ఫుటేజ్ , బారి కెడ్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయవలసిన స్థల ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం అరికెర గ్రామంలో సబ్ కలెక్టర్ మౌర్య […]
బాలింత ఉరి వేసుకొని ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం కదితోట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గీతమ్మ అనే అయిదు నెలల బాలింత ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలుపడింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గీతమ్మ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి అనారోగ్యం కారణంగా భర్తకు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినట్ల ఎస్ఐ తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన తెలిపారు.
వ్యాపార దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ […]
శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.
శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.ఇన్ ఫ్లో :60,457 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 66.182 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.10అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 197.2737 టీఎంసీలుకుడి,ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 40
ఆదోని 09 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయలు
గొర్రెల సహకార సంఘం చైర్మన్ గా శ్రీనివాసులు ఏకగ్రీవం
ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి25 వ వార్డు కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ అభినందనలు తెలియజేశారు.