కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవర గట్టు లో శనివారం జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. పత్తికొండ ఆర్డీవో, డి ఎస్ పి మరియు సంబంధిత అధికారులతో కలసి పార్కింగ్, సి.సి. ఫుటేజ్ , బారి కెడ్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయవలసిన స్థల ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం అరికెర గ్రామంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ డి ఎస్ పి వెంకట రామయ్య కలసి గ్రామ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో పండుగా జరుపుకునే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.