నల్లమల్ల అడవిలో మహిళపై చిరుత దాడి
నల్ల మల అడవి పచ్చర్ల లో చిరుత దాడిలో పూర్తిగా మహిళ తలభాగం తినివేసి మొండం వదిలేసి వెళ్లిన చిరుత పులి..
నంద్యాల – గిద్దలూరు మధ్య నల్లమల అడవి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరున్ బి (40) సాయంత్రం కట్టెల కోసం అడవి లోకి వెళ్లడంతో చిరుత పులి దాడి చేసి తలభాగం తినివేసి మొండం వదిలేసి వెలిందని బంధువులు తెలిపారు. చలమా రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డీఆర్ఓ రాజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చిరుత ఇటీవల సంచరిస్తు నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీ పై దాడి చేసి గాయపరిచింది.
అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు.ఏర్పాటు చేశారు.