స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకునే స్పీకర్ పదవికి ఈసారి లోక్సభలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరిని స్పీకర్ గా నియమించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి ఉప స్పీకర్ ను ఎన్నుకుంటారు. కానీ ఈసారి బిజెపి పార్టీ ప్రతిపక్ష పార్టీకి సహకరించకపోవడంతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం కోరింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బుధవారం లోక్ సభ స్పీకర్ కు ఎన్నిక జరగనుంది.