కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఫార్మ్-ఏ, ఫార్మ్-బి ఇచ్చిన పార్టీల వారికి పార్టీ రిజర్వ్ చేసిన గుర్తే కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ ఏజెంట్స్ ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఫార్మ్-8 ఇవ్వడంతో పాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు
అభ్యర్థుల పేర్లు, పార్టీ, అభ్యర్థికి కేటాయించిన గుర్తులు
గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీ అభ్యర్థులు
- ఆసియా బాను అమ్లివాలె, బహుజన సమాజ్ పార్టీ , ఏనుగు
- డా. పి. వి పార్థసారథి, భారతీయ జనతా పార్టీ, కమలం.
- జి రమేష్ యాదవ్ , భారత జాతీయ కాంగ్రెస్, హస్తం
- వై సాయి ప్రసాద్ రెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ , సీలింగ్ ఫ్యాన్
నమోదు కాబడిన రాజాకీయ పార్టీల అభ్యర్థులు - కె. రంగన్న, జై భీమ్ రావు భారత్ పార్టీ, కోర్టు
స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, పార్టీ, గుర్తులు - ఉరుకుందు వడ్డే , స్వతంత్ర అభ్యర్థి, లాప్ టాప్
- జి. జయన్న, స్వతంత్ర అభ్యర్థి, పండ్ల బుట్ట
- కే దస్తగిరి నాయుడు, స్వతంత్ర అభ్యర్థి, వజ్రం
- బి. నాగరాజు, స్వతంత్ర అభ్యర్థి, ఆపిల్
- జి. యువరాజ్, స్వతంత్ర అభ్యర్థి, గ్లాస్ టoబ్లర్
ఈ సమావేశంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్ . శేషయ్య, ఆదోని తహశీల్దార్ హసీనా సుల్తానా, ఉప తాసిల్దారులు, వినీత్, కౌసర్ భాను, రుద్ర గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.