News
అదోనిలో 10 మంది అభ్యర్థుల పోటీ, వారి గుర్తులు

కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఫార్మ్-ఏ, ఫార్మ్-బి ఇచ్చిన పార్టీల వారికి పార్టీ రిజర్వ్ చేసిన గుర్తే కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ ఏజెంట్స్ ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఫార్మ్-8 ఇవ్వడంతో పాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు
అభ్యర్థుల పేర్లు, పార్టీ, అభ్యర్థికి కేటాయించిన గుర్తులు
గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీ అభ్యర్థులు
- ఆసియా బాను అమ్లివాలె, బహుజన సమాజ్ పార్టీ , ఏనుగు
- డా. పి. వి పార్థసారథి, భారతీయ జనతా పార్టీ, కమలం.
- జి రమేష్ యాదవ్ , భారత జాతీయ కాంగ్రెస్, హస్తం
- వై సాయి ప్రసాద్ రెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ , సీలింగ్ ఫ్యాన్
నమోదు కాబడిన రాజాకీయ పార్టీల అభ్యర్థులు - కె. రంగన్న, జై భీమ్ రావు భారత్ పార్టీ, కోర్టు
స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, పార్టీ, గుర్తులు - ఉరుకుందు వడ్డే , స్వతంత్ర అభ్యర్థి, లాప్ టాప్
- జి. జయన్న, స్వతంత్ర అభ్యర్థి, పండ్ల బుట్ట
- కే దస్తగిరి నాయుడు, స్వతంత్ర అభ్యర్థి, వజ్రం
- బి. నాగరాజు, స్వతంత్ర అభ్యర్థి, ఆపిల్
- జి. యువరాజ్, స్వతంత్ర అభ్యర్థి, గ్లాస్ టoబ్లర్
ఈ సమావేశంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్ . శేషయ్య, ఆదోని తహశీల్దార్ హసీనా సుల్తానా, ఉప తాసిల్దారులు, వినీత్, కౌసర్ భాను, రుద్ర గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు