News
మహిళలు మాత్రమే పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం
■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
కనీసం పదవతరగతి వరకు చదివి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్యగల మహిళలకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు పనిచేసే చోటు విడియోల కొరకు క్రింద ఇచ్చిన లింక్ ను చుడండి.
ఉద్యోగ వివరాలు :
కంపెనీ : స్మార్ట్ మొబైల్ తయారి కంపెనీ
పోస్ట్ : ప్రొడక్షన్ ఆపరేటర్
విద్యార్హతలు: 10th లేదా ఆపైన
వయస్సు : 18 నుండి 26లోపు
un Married
జీతం : Rs.13,740/-
షిఫ్ట్ లు : 3 రొటేషన్ షిఫ్ట్ లు కలవు.
పని గంటలు: 8 గంటలు నెలలో 26 రోజులు పని , నాలుగు రోజులు సెలవు
పనిచేయు స్థలం : చిత్తూరు
సదుపాయాలు : ఉచిత రవాణా, కాంటీన్, పి.ఫ్., ఇ.యస్.ఐ. సదుపాయలు
మీ పూర్తీ వివరాలను ఈ లింక్ ద్వారా పంపిచండి
https://docs.google.com/forms/d/e/1FAIpQLSexE3ZSRMpTYq8b5xMCHcaIuVKZWtYfvdTcFSqLgZx7_8t0Fg/viewform



News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
