Connect with us

News

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..
■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..
■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం..

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 మంది పరారీలో ఉన్నరు వారివద్ద నుండి సుమారు 1 కోటి 50 లక్షల విలువ కలిగిన పశువులు (మేకలు & పందులు) మరియు 02 బోలెరో క్యాంపర్ వాహనాలు ఒక ఫోర్డ్ కారు, మారణాయుధాలు, 14 సెల్ ఫోన్, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్లు, కారంపొడి ప్యాకెట్లు, రాళ్లు స్వాదీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు

డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు ఆదోనిలో పశువుల దొంగతనాల 13 కేసులు నమోదు కాగా అందులో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉన్నారని వారిలో 16 మందిని అరెస్టు చేశామని తెలిపారు మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గావిస్తున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో  వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. వీరు దొంగతనానికి రాత్రి ఒకటి నుంచి మూడు ప్రాంతంలో చేస్తారని ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా మారున ఆయుధాలతో రాడ్లతో కత్తులతో ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్లతో కళ్ళలో కారం కొట్టి నరరూప రాక్షసుల దాడులు చేస్తారని తెలిపారు. అంతేకాక వారి వాహనాలతో గుద్ధి వెళ్లిపోతారని వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన వారిని తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు

ఆదోని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  శ్రీరామ్ స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 15.09 2925 వ తేదీన సాయంత్రం 04:00 గంటలకు ఆదోని నుంచి మారవరం కు పోషి రోడ్ లో గల భారత్ గ్యాస్ గోడౌస్ ఎదురుగా పాడుబడిన శ్రీనివాస ట్రేడింగ్ & జీన్సింగ్ ఫ్యాక్టరీ అపరణము లో 16 మందిని అదుపులోనికి తీసుకుని విచారించగా

పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు

వారి నుంచి  1,49,33,000/- (అక్షరాలా ఒక కోటి సలబై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు) విలువ చేసే 542 పశువులను, రెండు బోలెరో వాహనాలను, ఒక కారును, వివిధ రకాలైన మారణాయుధాలను, కారం పొడిని మరియు 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ రూల్ డ్రి బాటిల్లను స్వాధీన పరచుకుని 16 మంది ముద్దాయులను రిమైండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. పై తెలిపిన ముద్దాములు, సశువుల దొంగతనము చేసే క్రమం లో బాదితులు కానీ, పోలీసులు కానీ పట్టుకునే ప్రయత్నం చేసిన వారిపై క్రూరంగా బాధితులను, అడ్డు వచ్చిన పోలీసుల పై కారం పొడి చల్లి కట్టెలు, రాళ్ళు సీసాల తో, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బొలెరో క్యాంపర్
పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్, బొలెరో క్యాంపర్

గతం లో కూడా తెలంగాలు రాష్ట్రం లో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధి లో అనేక చోట్ల రబరి, డకాయిటీ లకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట యెమ్మిగనూర్ మరియు ఆదోని లో అడ్డొచ్చిన బాధితులను తలు మరియు చేతులు విరగగొట్టి పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు.  వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కేసులలో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉందగా వారిలో 16 మండి ప్రస్తుతము ఆరెస్టు చేశామని వీరిలో ఒకరి మీద కోడుమూరు పరిధిలో ఒక మర్జర్ కేసు మరియు ఒకరి మీద యెమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దొమ్మి, హత్యా ప్రయత్నం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు మిగిలిన 9 మంది ముదాయుల కొరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శ్రీరామ్ ని వారి సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు

ముద్దాయిలను మీడియా ముందుకు తెస్తున్నా పోలీసులు

ముద్దాయుల నుంచి స్వాధీనపరచుకున్న వాటి వివరాలు..
1. అక్షరాలా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు (Rs. 1,49,33,000/-) విలువ చేసే 542 పశువులు
2. KA36B 9672 మరియు KA3689672 రిజిస్ట్రేషన్ సంబర్ గల రెండు Bolero వాహనాలు
3. AP16 DP5708 రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఒక కారు..
4. వివిద రకాల మారణాయుధాలు..
5. 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ కూల్ డ్రింక్స్ బాబిళ్లు..
6. కారం పొడి ప్యాకెట్లు..
అదుపులోనికి తీసుకోబడిన ముద్దాయి ల వివరాలు:
1. యెరుకల మజ్జ (ముత్తు), సోమ్లాపూర్ గ్రామం, సింధనూర్ తాలూకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక.
2. యెరుకలి బజంత్రీ కృష్ణ శ్రీ బాబా, సిందనూర్ టౌస్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము.
3. ఐజంల సిద్దు @ యరుకలి సిద్దు, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,

ముద్దాయిలను మీడియా ముందుకు చేస్తున్న పోలీసులు

4. బజంత్రి మల్లికార్జున @ ఎరుకలి మల్లికార్జున @ మల్లి, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
5. యెరుకలి చంద్ర (@ చమ్మక్ చంద్ర, BC కాలనీ, హోళగుంధ గ్రామం & మండలం, కర్నూలు జిల్లా, ప్రస్తుత నివాసము సచివాలయం సమీపంలో, చిన్న హుల్తీ గ్రామం, పత్రికొండ మండలం, కర్నూలు జిల్లా.
6. యెరుకల హుసలప్ప @ హుసల, సిందనూర్ టౌస్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,
7 యెరుకల రంగన్న, శక్తిగుడి, ఎద్దుల మార్కెట్ దగ్గర, యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా.
8. యెరుకలి నాగరాజు @ సిరిగేరి నాగరాజు @ రుప్ప, సిరిగేరి గ్రామం, సిరుగుప్ప తాలూకా, బళ్లారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం
9. విజంత్రీ హనుమంతు @ ఎరుకలి హనుమంతు @ గుడ్డిలప్ప, సిందనూర్ టౌన్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
10. యెరుకలి అర్జున్ @ కోలగల్లు అర్జున్, కోలగల్లు గ్రామం, బళ్లారి తాలూకా (@) జిల్లా, కర్ణాటక రాష్ట్రం
11. యెరుకలి మహేష్ మదిన గ్రామం, కొతాళం మండలం, కర్నూలు జిల్లా,
12 బంద్ శంకర్ కోట్, జనతా కాలనీ, సిండమార్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
13. వాల్మీకి వెంకటేష్ @ వెంకి, హనుమంత క్యాంపు, సిందనూర్ తాలూడా రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం..
14. చెరుకలి ఆంజనేయులు @ మిగుదొడ్డి అంజి, సంగుదొడ్డి గ్రాము, అయి ముండలు, గన్నాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
15. ఎరుకలి సందేశ్ @ గొంటు, అక్కలకోట గ్రామము, సిరుగుప్ప తాలూకా, బళ్ళారి జిల్లా, కర్నాటక రాష్ట్రము.
26. ఎరుకలి రవిచంద్ర డవి, మంకేశ్వరి గ్రామము, ముంద్రాజయం మండలం కర్నూల్ జిల్లా
పరాప్ లో ఉన్న ముద్దాయులు..
1. కృష్ణ, సింధనూరు టౌన్
2. సుంకన్న, కందనతి, యెమ్మిగనూరు,
3. భీమ, యెమ్మిగనూరు.
4 మారేష్, చిన్న హుల్తి
5. అంజి, హోలగుంద
6. రమేషు తురుకల్ డోన, రాయచూరు జిల్లా
7. కొరగల్ మరేష్ @ గుడ్ల మరేష్
3. యెమ్మిగనూడు పెద్ద నాగరాజు
9. చిన్న నాగరాజు @ బాతు

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

News

ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న  ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.

ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప  బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో  చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరిశీలిస్తున్న పోలీసులు
Continue Reading

Trending