News
ఇంటింటి కోళ్ళాయి పథకం కింద 77 కోట్లు నిధులు కేటాయించండి- ఎంఎల్ఏ

అమరావతి: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని విరామ సమయాల్లో ఆదోని అభివృద్ధి కోసం మంత్రులతో అధికారులతో కలుస్తున్నారు అందులో భాగంగా ఇంటింటి కోళ్ళాయి (జల్జీవన్ మిషన్) పథకం క్రింద ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామాల్లో శుద్ధమైన త్రాగునీటి సరఫరా కొరకు 77 కోట్లు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి కోరారు. మంగళవారం అసెంబ్లీ సెషన్స్ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఇంటింటి కోళ్ళాయి పథకంకు సంబంధించిన టెండర్లను పిలవాల్సిన నివేదికను సమర్పించారు. ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి అధికంగా ఉందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామీణ పాత్రలో ఇంటింటి కోళ్ళాయి పథకాన్ని అమలు చేయలేక పోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదోని మండల పరిధిలోని సుమారు 25 గ్రామాల్లో ఇంటింటి కోళ్ళాయి పథకం ప్రారంభానికి నోచుకోలేదని, ఆ గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ 77 కోట్ల రూపాయల అంచనాలను గత అధికారులు తయారు చేసినప్పటికి అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు నీటిని అందించలేకపోయారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నీళ్లు అందించేందుకు కృషి చేయాలన్ని కోరారు.
గ్రామీణ రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు రూ 13 కోట్లు మంజూరు చేయాలి..
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల గ్రామీణ రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు రూ 13 కోట్లు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి కోరారు. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం విరామ సమయంలో మంత్రి గారిని కలిసి ఆదోని మండల పరిధిలోని గ్రామ పంచాయతీ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన సమర్పించి రోడ్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. మంత్రి పవన్ కళ్యాణ్ అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
నీటి సరఫరా కొరకు 250 బోర్ వెల్స్ వేయాలి..
మండలంలో నీటి సరఫరా కొరకు 250 బోర్ వెల్స్ వేయించుట గురించి కూడా ప్రస్తావించారు. అలాగే మండల పరిధిలోని బసాపురం గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో ఎస్. ఎస్. ట్యాంక్ నిర్మాణం కొరకు రూ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు