News
చెత్తలో వెళ్లిపోయిన 5 లక్షల డైమండ్ నెక్లెస్
చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను వెతికి తీశారు.
చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన విషయాన్ని గమనించారు.
చెన్నైలో పట్టణానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం చేయించిన రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను పొరపాటున చెత్త బుట్టలో పాడివేశాడు. పారిశుద్ధ కార్మికులు బుట్టలో ఉన్న చెత్తను తీసుకొని వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత గుర్తు చేసుకున్న యజమాని కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నై కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు వెంటనే చెత్తను సేకరించడానికి చెన్నై కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ విషయం తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు సమీపంలోని అన్ని చెత్త డబ్బాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో.. ఓ చెత్త కుప్పలో పూలమాలలో చిక్కుకుపోయిన డైమండ్ నెక్లెస్ కనిపించడంతో అందరూ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై కార్పొరేషన్ అధికారులు ఆ డైమండ్ నెక్లెస్ను తిరిగి యజమానికి అందజేశారు.
తన దుఃఖాన్ని బాధను అర్థం చేసుకున్న అధికారులు వెంటనే స్పందించి విలువైన నెక్లెస్ను వెతికి ఇచ్చినందుకు అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




