News
జర్నలిస్టులతో గౌరవంగా మాట్లాడండి..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నాము అని అన్నారు. జర్నలిస్టులను వీడు, వాడు, ఒరే బాబు అంటూ సంబోధించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని విజయసాయి రెడ్డి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నాయి.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

hr anandareddy
17/07/2024 at 7:59 pm
జర్నలిస్ట్ లు సమాజంలో జరికే అక్రమాలను అక్రమార్కుల పేరుతో సహా ప్రచురిస్తే వారిపై ప్రజల్లో నమ్మకం,విశ్వాసం పెరుగుతాయి.కాని నేడు అలాంటి జర్నలిజం ఉందా? లేదా? అనేది జర్నలస్ట్ లే తేల్చు కోవాలి. వారిగౌరవం వారిచేతుల్లోనే ఉందన్నది నిజం.