తీవ్ర విషాదం.. 13 మంది భారతీయులు గల్లంతు!
ఒమన్లో తీవ్ర విషాదం జరిగింది. చమురు తరలిస్తున్న ఓ నౌక నీట మునిగి. 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక దేశస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. షిప్ బోల్తా పడి నీట మునిగిందని, అయితే సముద్రంలోకి ఆయిల్ లీక్ అయిందా? వంటి వివరాలు తెలియాల్సి ఉందని కేంద్రం వెల్లడించింది. యెమెన్లో ఎడెన్ పోర్టుకు నౌక వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.