కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్ గాంధీ నగర్ లో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ క్రమంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల రాము అనే బాలుడి పై దాడి చేసి తలకు కరవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన బాలుడిని తండ్రి జమ్మన్న వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించాలని సూచించారు ఈ సందర్భంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు 100 కుక్కలు ఉన్నాయని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పాటించికోవడంలేదని అగ్రహం వెక్తం చేశారు.