Connect with us

News

తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు

Published

on

పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..
వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి. కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం. విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు.. కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు. నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వాలు నీటి యుద్దాలు సృష్టించి. రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు. అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు. నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు. కాస్త సమయం పట్టొచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ..
వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు. అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు. రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు. కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు. రెచ్చి పోయి. విద్వేషాలు పెంచుకుంటారా అంటే. మిలియన్ డాలర్ ప్రశ్న? వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు. సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు. కేవలం ఉన్న నమ్మకం. ఒక ప్రశాంతమైన వాతావరణం లో…. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending