Connect with us

News

తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు

Published

on

పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..
వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి. కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం. విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు.. కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు. నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వాలు నీటి యుద్దాలు సృష్టించి. రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు. అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు. నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు. కాస్త సమయం పట్టొచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ..
వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు. అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు. రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు. కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు. రెచ్చి పోయి. విద్వేషాలు పెంచుకుంటారా అంటే. మిలియన్ డాలర్ ప్రశ్న? వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు. సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు. కేవలం ఉన్న నమ్మకం. ఒక ప్రశాంతమైన వాతావరణం లో…. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News1 month ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending