Connect with us

News

తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు

Published

on

పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..
వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి. కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం. విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు.. కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు. నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వాలు నీటి యుద్దాలు సృష్టించి. రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు. అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు. నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు. కాస్త సమయం పట్టొచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ..
వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు. అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు. రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు. కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు. రెచ్చి పోయి. విద్వేషాలు పెంచుకుంటారా అంటే. మిలియన్ డాలర్ ప్రశ్న? వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు. సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు. కేవలం ఉన్న నమ్మకం. ఒక ప్రశాంతమైన వాతావరణం లో…. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.

News

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Published

on

ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్‌ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.

    కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్‌ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.

    ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..

    సీజ్ చేసి తీసుకు వస్తున్న గ్యాస్ సిలిండర్లు
    సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లు
    తనిఖీలు నిర్వహిస్తున్న  డీఎస్ఓ రాజా రఘువీర్
    Continue Reading

    News

    హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

    Published

    on

    ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

    ​అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు

    ​తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

    ​అధికారుల హెచ్చరిక

    ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

    ​డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం

    ​ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

    ​వినియోగదారులకు సూచనలు:

    • సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
    • అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
    • ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
    • టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
    Continue Reading

    News

    ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

    Published

    on

    ​కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

    ​​కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ​వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

    Continue Reading

    Trending