Connect with us

News

అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం వల్ల బయటకు పోవటం చాలా ఇబ్బందికరముగా మారి అవతల అగ్నిప్రమాద స్థలానికి చేరడానికి ఆలస్యం అవుతోంది. కావున అగ్నిప్రమాద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది అని తెలిపారు. గతంలో మునిసిపల్ కమీషనర్ రామలింగేశ్వర్ ఇక్కడ సిమెంటు రోడ్ వేయటానికి ప్రతిపాదన సిద్ధం చేసినా పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయాలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

Published

on

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు.. కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు..

లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేసిన నిందితుడు. ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి, పని ఇప్పిస్తానని చెప్పి, నసుల్తాపూర్ శివారులోని తీసుకెళ్లి అర తులం బంగారం, 20 గ్రాముల వెండి కాజేసి వృద్ధురాలిని బావిలో తోసేసి వెళ్ళిపోయిన దినేష్ రెడ్డి..

వృద్ధురాలిని బావిలో నుంచి బయటికి తీస్తున్న గ్రామస్తులు

దాదాపు 21 గంటలు బావిలో ఉన్న అనంతరం, మరుసటి రోజు ఉదయం లక్ష్మిని గ్రామస్థులు బావి నుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిరు. సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. నిందితుడిని దినేష్ రెడ్డిని విచారించగా బంగారాన్ని టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి విక్రయించి రూ.30 వేలు తీసుకున్న నిందితుడు తెలిపాడు. నిందితుడితో పాటు బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

బావిలో పడిపోయిన వృద్ధురాలు
Continue Reading

News

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

సీజ్ చేసిన 35 వాహనాలు
సీజ్ చేసిన 35 వాహనాలు
మీడియాతో మాట్లాడుతున్న సిఐ రాజశేఖర్ రెడ్డి
Continue Reading

News

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న షేక్ షాకీర్ , అక్షయ్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెండి బిస్కెట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వెండిని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామని సిఐ తెలిపారు.

Continue Reading

Trending