కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు కర్ణాటక మధ్య 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. సిఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు తమకు సమాచారం రావడంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గశేష్ సర్కిల్ కు చెందిన మట్కా బీటర్ యువరాజ్, బబ్బులమ్మ గుడికి చెందిన హనుమన్న మరియు బోయ గేరికి చెందిన వీరేష్ ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 7 బాక్సుల కర్నాటక మధ్యంను తీసుకొని వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ల లను స్వాధీనం చేసుకొని వారి ముగ్గురిని అరెస్టు చేసి , కేసు నమోదు పరచి రిమాండ్ కి తరలించామని తెలిపారు.
ఈ దాడుల్లో నందు 1 టౌన్ CI విక్రమసింహ, SI జహీర్ , సిబ్బంది రంగస్వామి, HC వీరా రెడ్డి, సుధీర్ , రంగస్వామి, అయ్యన్న మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసుల విజ్ఞప్తి…
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్, పేకాట ల గురించి
9121101135 నెంబరు కు సమాచారం అందిచవలసిందిగా కోరారు…
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.