News
కర్ణాటక మద్యంపై సెబ్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఆదోని మండలంలో సెబ్ పోలీస్ వేరువేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 5 మంది LLC కెనాల్ వద్ధ బాధినేహాల్ గ్రామానికి చెందిన M. నాగప్ప, పెద్ద హరివానం చెక్ పోస్ట్ వద్ద సిరుగుప్పకు చెందిన విజయ్, అనిల్, మాదిరే గ్రామానికి చెందిన వీరేష్ మరియు ఉసేనప్ప లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కర్ణాటక మద్యం బాక్సులను మరియు మూడు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. సబ్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

ఈ దాడులలో ఆదోని సెబ్ సిఐ హరికృష్ణ, ఎస్ఐ శివ ప్రసాద్ మరియు పెద్ద హరివణం చెక్ పోస్ట్ సిఐ మంజుల ఎస్ఐ కమలాకర్ సిబ్బంది సోమేష్, సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




