దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగి
పంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో దుబాయికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్ ఇమ్రాన్ ను కలిసి దుబాయిలో నెలన్నర రోజులు పాటు సెంట్రింగ్ పనులు చేస్తే రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పాడు. దీనికి ఇమ్రాన్ ఒప్పుకున్నాడు. అప్పు చేసి ఏజెంట్ సయ్యద్ ద్వారా 2023 మార్చి 30వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ తనను గదిలో పెట్టారన్నారు. 45 రోజులు గడిచినా తనను పనికి పంపించలేదన్నారు. అక్కడి వారు ఓ కాగితం తీసుకొచ్చి, నీ పేరుపై తాము బ్యాంకు క్రెడిట్ కార్డు
ద్వారా రుణాలు తీసుకుంటామని, సంతకం చేస్తే చాలని వేధిస్తున్నారన్నాడు. తాను సెంట్రింగ్ పనుల కోసం వెళ్తే.. ఇలా రుణాల కోసం సంతకం చేయ మని వేధిస్తున్నారని, గదిలో నుంచి బయటకు కూడా పంపడంలేదని వాపోయారు. తను పాస్పోర్టు, వీసా సైతం తీసుకున్నారని. కేంద్ర ప్రభుత్వం, దుబాయిలోని అంబసీ వారు స్పందించి తనను దుబాయి నుంచి భారతదేశానికి పంపించాలని కోరారు.