Connect with us

News

ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు

Published

on

దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగి
పంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో దుబాయికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్ ఇమ్రాన్ ను కలిసి దుబాయిలో నెలన్నర రోజులు పాటు సెంట్రింగ్ పనులు చేస్తే రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పాడు. దీనికి ఇమ్రాన్ ఒప్పుకున్నాడు. అప్పు చేసి ఏజెంట్ సయ్యద్ ద్వారా 2023 మార్చి 30వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ తనను గదిలో పెట్టారన్నారు. 45 రోజులు గడిచినా తనను పనికి పంపించలేదన్నారు. అక్కడి వారు ఓ కాగితం తీసుకొచ్చి, నీ పేరుపై తాము బ్యాంకు క్రెడిట్ కార్డు
ద్వారా రుణాలు తీసుకుంటామని, సంతకం చేస్తే చాలని వేధిస్తున్నారన్నాడు. తాను సెంట్రింగ్ పనుల కోసం వెళ్తే.. ఇలా రుణాల కోసం సంతకం చేయ మని వేధిస్తున్నారని, గదిలో నుంచి బయటకు కూడా పంపడంలేదని వాపోయారు. తను పాస్పోర్టు, వీసా సైతం తీసుకున్నారని. కేంద్ర ప్రభుత్వం, దుబాయిలోని అంబసీ వారు స్పందించి తనను దుబాయి నుంచి భారతదేశానికి పంపించాలని కోరారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 13.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 12.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 12 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1601.08 అడుగులకు చేరుకుంది.మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 22.948 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 25,120 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 19,642 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 381 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
  • ఎగువన ప్రవాహాలు: తుంగా రిజర్వాయర్ నుండి 6,621 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.13 అడుగులుగా ఉండగా.. 76.912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 36.254 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని 20వ వార్డు మండగిరి ఎస్సీ కాలనీలో బండి రాముడనే వ్యక్తి ఆనరోగ్యంతో మృతి చెందారని వరిది పేద కుటుంబం అని వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ​బాధిత కుటుంబ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించి బండి రాముడు కుటుంబానికి మట్టి ఖర్చుల (అంత్యక్రియల) నిమిత్తం 10,000 రూపాయల (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మృతుడి కుటుంబ సభ్యులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ఇంచార్జ్ మొండి మల్లయ్య మాజీ కౌన్సిలర్ మధుబాబు, గంజలయ్య, మల్లికార్జున టైలర్, బీరువాలు హనుమంతు, ఉమేష్, శేఖర్ టైలర్, హోటల్ నరసింహులు. మణి బాబు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేస్తున్న కౌన్సిలర్
Continue Reading
News1 day ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News2 days ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News3 days ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

News4 days ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News4 days ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News5 days ago

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

News5 days ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News5 days ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News1 week ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News3 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

Trending