News
ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు

దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగి
పంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో దుబాయికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్ ఇమ్రాన్ ను కలిసి దుబాయిలో నెలన్నర రోజులు పాటు సెంట్రింగ్ పనులు చేస్తే రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పాడు. దీనికి ఇమ్రాన్ ఒప్పుకున్నాడు. అప్పు చేసి ఏజెంట్ సయ్యద్ ద్వారా 2023 మార్చి 30వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ తనను గదిలో పెట్టారన్నారు. 45 రోజులు గడిచినా తనను పనికి పంపించలేదన్నారు. అక్కడి వారు ఓ కాగితం తీసుకొచ్చి, నీ పేరుపై తాము బ్యాంకు క్రెడిట్ కార్డు
ద్వారా రుణాలు తీసుకుంటామని, సంతకం చేస్తే చాలని వేధిస్తున్నారన్నాడు. తాను సెంట్రింగ్ పనుల కోసం వెళ్తే.. ఇలా రుణాల కోసం సంతకం చేయ మని వేధిస్తున్నారని, గదిలో నుంచి బయటకు కూడా పంపడంలేదని వాపోయారు. తను పాస్పోర్టు, వీసా సైతం తీసుకున్నారని. కేంద్ర ప్రభుత్వం, దుబాయిలోని అంబసీ వారు స్పందించి తనను దుబాయి నుంచి భారతదేశానికి పంపించాలని కోరారు.
News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర