Connect with us

News

మట్కా రాస్తున్న ముగ్గురు అరెస్ట్ 1,20,000 నగదు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య మరియు బబ్బులమ్మ గుడి వద్ద నివాసముండే శ్రీనివాసులు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ఒకరు SKD కాలనీ కి చెందిన ఇక్బాల్ పరారీలో యూన్నాడని సిఐ విక్రమ సింహ తెలిపారు. వారి వద్దనుండి మట్కా చీటీలు, రూ. 1,20,000/- డబ్బులను, 15 లీటర్ల నిషేధిత నాటు సారాయ్ స్వాధీనం చేసుకొని ముగ్గురి కేసునమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ, సిబ్బంది రంగస్వామి, HC మద్దిలేటి , సుధీర్ , మధు, వెంకటేష్ మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు….

మట్కా నిర్వాహకుల అరెస్టు చూపిస్తున్న సి ఐ విక్రమ సింహ

ప్రజలకు పోలీసువారి విన్నపం..
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ , పేకాట ల గురించి మీకు తెలిస్తే కింది నెంబర్ సమాచారం ఇవ్వాలని
9121101135
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అని సిఐ విక్రమ సింహ తెలిపారు.

యూట్యూబ్ వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

Published

on

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో పూజకు వెళ్తున్న ఫోటో

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి,  చీరలతో  సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం  ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.  చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి  కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.

కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తాన్న ఫోటో
రథి మన్మధుల దేవుళ్ల
Continue Reading

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Trending