News
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..
■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..
■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం..

కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 మంది పరారీలో ఉన్నరు వారివద్ద నుండి సుమారు 1 కోటి 50 లక్షల విలువ కలిగిన పశువులు (మేకలు & పందులు) మరియు 02 బోలెరో క్యాంపర్ వాహనాలు ఒక ఫోర్డ్ కారు, మారణాయుధాలు, 14 సెల్ ఫోన్, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్లు, కారంపొడి ప్యాకెట్లు, రాళ్లు స్వాదీనం చేసుకున్నారు.

డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు ఆదోనిలో పశువుల దొంగతనాల 13 కేసులు నమోదు కాగా అందులో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉన్నారని వారిలో 16 మందిని అరెస్టు చేశామని తెలిపారు మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గావిస్తున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. వీరు దొంగతనానికి రాత్రి ఒకటి నుంచి మూడు ప్రాంతంలో చేస్తారని ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా మారున ఆయుధాలతో రాడ్లతో కత్తులతో ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్లతో కళ్ళలో కారం కొట్టి నరరూప రాక్షసుల దాడులు చేస్తారని తెలిపారు. అంతేకాక వారి వాహనాలతో గుద్ధి వెళ్లిపోతారని వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన వారిని తెలిపారు.

ఆదోని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 15.09 2925 వ తేదీన సాయంత్రం 04:00 గంటలకు ఆదోని నుంచి మారవరం కు పోషి రోడ్ లో గల భారత్ గ్యాస్ గోడౌస్ ఎదురుగా పాడుబడిన శ్రీనివాస ట్రేడింగ్ & జీన్సింగ్ ఫ్యాక్టరీ అపరణము లో 16 మందిని అదుపులోనికి తీసుకుని విచారించగా

వారి నుంచి 1,49,33,000/- (అక్షరాలా ఒక కోటి సలబై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు) విలువ చేసే 542 పశువులను, రెండు బోలెరో వాహనాలను, ఒక కారును, వివిధ రకాలైన మారణాయుధాలను, కారం పొడిని మరియు 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ రూల్ డ్రి బాటిల్లను స్వాధీన పరచుకుని 16 మంది ముద్దాయులను రిమైండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. పై తెలిపిన ముద్దాములు, సశువుల దొంగతనము చేసే క్రమం లో బాదితులు కానీ, పోలీసులు కానీ పట్టుకునే ప్రయత్నం చేసిన వారిపై క్రూరంగా బాధితులను, అడ్డు వచ్చిన పోలీసుల పై కారం పొడి చల్లి కట్టెలు, రాళ్ళు సీసాల తో, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు.


గతం లో కూడా తెలంగాలు రాష్ట్రం లో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధి లో అనేక చోట్ల రబరి, డకాయిటీ లకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట యెమ్మిగనూర్ మరియు ఆదోని లో అడ్డొచ్చిన బాధితులను తలు మరియు చేతులు విరగగొట్టి పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కేసులలో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉందగా వారిలో 16 మండి ప్రస్తుతము ఆరెస్టు చేశామని వీరిలో ఒకరి మీద కోడుమూరు పరిధిలో ఒక మర్జర్ కేసు మరియు ఒకరి మీద యెమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దొమ్మి, హత్యా ప్రయత్నం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు మిగిలిన 9 మంది ముదాయుల కొరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శ్రీరామ్ ని వారి సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు

ముద్దాయుల నుంచి స్వాధీనపరచుకున్న వాటి వివరాలు..
1. అక్షరాలా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు (Rs. 1,49,33,000/-) విలువ చేసే 542 పశువులు
2. KA36B 9672 మరియు KA3689672 రిజిస్ట్రేషన్ సంబర్ గల రెండు Bolero వాహనాలు
3. AP16 DP5708 రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఒక కారు..
4. వివిద రకాల మారణాయుధాలు..
5. 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ కూల్ డ్రింక్స్ బాబిళ్లు..
6. కారం పొడి ప్యాకెట్లు..
అదుపులోనికి తీసుకోబడిన ముద్దాయి ల వివరాలు:
1. యెరుకల మజ్జ (ముత్తు), సోమ్లాపూర్ గ్రామం, సింధనూర్ తాలూకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక.
2. యెరుకలి బజంత్రీ కృష్ణ శ్రీ బాబా, సిందనూర్ టౌస్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము.
3. ఐజంల సిద్దు @ యరుకలి సిద్దు, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,

4. బజంత్రి మల్లికార్జున @ ఎరుకలి మల్లికార్జున @ మల్లి, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
5. యెరుకలి చంద్ర (@ చమ్మక్ చంద్ర, BC కాలనీ, హోళగుంధ గ్రామం & మండలం, కర్నూలు జిల్లా, ప్రస్తుత నివాసము సచివాలయం సమీపంలో, చిన్న హుల్తీ గ్రామం, పత్రికొండ మండలం, కర్నూలు జిల్లా.
6. యెరుకల హుసలప్ప @ హుసల, సిందనూర్ టౌస్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,
7 యెరుకల రంగన్న, శక్తిగుడి, ఎద్దుల మార్కెట్ దగ్గర, యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా.
8. యెరుకలి నాగరాజు @ సిరిగేరి నాగరాజు @ రుప్ప, సిరిగేరి గ్రామం, సిరుగుప్ప తాలూకా, బళ్లారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం
9. విజంత్రీ హనుమంతు @ ఎరుకలి హనుమంతు @ గుడ్డిలప్ప, సిందనూర్ టౌన్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
10. యెరుకలి అర్జున్ @ కోలగల్లు అర్జున్, కోలగల్లు గ్రామం, బళ్లారి తాలూకా (@) జిల్లా, కర్ణాటక రాష్ట్రం
11. యెరుకలి మహేష్ మదిన గ్రామం, కొతాళం మండలం, కర్నూలు జిల్లా,
12 బంద్ శంకర్ కోట్, జనతా కాలనీ, సిండమార్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
13. వాల్మీకి వెంకటేష్ @ వెంకి, హనుమంత క్యాంపు, సిందనూర్ తాలూడా రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం..
14. చెరుకలి ఆంజనేయులు @ మిగుదొడ్డి అంజి, సంగుదొడ్డి గ్రాము, అయి ముండలు, గన్నాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
15. ఎరుకలి సందేశ్ @ గొంటు, అక్కలకోట గ్రామము, సిరుగుప్ప తాలూకా, బళ్ళారి జిల్లా, కర్నాటక రాష్ట్రము.
26. ఎరుకలి రవిచంద్ర డవి, మంకేశ్వరి గ్రామము, ముంద్రాజయం మండలం కర్నూల్ జిల్లా
పరాప్ లో ఉన్న ముద్దాయులు..
1. కృష్ణ, సింధనూరు టౌన్
2. సుంకన్న, కందనతి, యెమ్మిగనూరు,
3. భీమ, యెమ్మిగనూరు.
4 మారేష్, చిన్న హుల్తి
5. అంజి, హోలగుంద
6. రమేషు తురుకల్ డోన, రాయచూరు జిల్లా
7. కొరగల్ మరేష్ @ గుడ్ల మరేష్
3. యెమ్మిగనూడు పెద్ద నాగరాజు
9. చిన్న నాగరాజు @ బాతు
News
ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్
ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.
ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..



News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
News
ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



-
News3 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News4 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News4 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News3 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News7 days agoహోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
-
News2 weeks agoఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
-
News3 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News3 weeks agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
