News
ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్ దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసులకు తరలించరు. వివరాల్లోకెళ్ తే వివరాల్లోకి వెళ్తే పార్వతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు నాగరాజ్ బాధ్యతలు వదిలి తాగుడుకు బానిసై బెంగళూరుకి వెళ్లిపోయాడు తల్లి పార్వతి తన ఇద్దరు కూతుర్ల వద్ద జీవనం సాగిస్తుంది. ఆమె తల్లి ఆస్తిలో భాగంగా వచ్చిన ఇండ్లు బాడుగకు ఇచ్చి ఆ వచ్చిన నగదు తో మరియు ప్రభుత్వం నుంచి పింఛన్ తో కూతుర్ల వద్దనె తల దాచుకుంటుంది.
తల్లి పార్వతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గురువారం రోజు బెంగళూరు నుంచి వచ్చిన కొడుకు నాగరాజు ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని చెప్పడంతో తల్లి పార్వతి సంతకం చేయనని తన జీవన ఆధారం వచ్చే బాడుగ పైనే గడుస్తుందని చెప్పడంతో తనపై దాడి చేశాడని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




