News
పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్, గడ్డపార సాన పెట్టుకోవడానికి వేతనం కొనసాగించాలని, అదేవిధంగా ఉపాధి కూలీలకు త్రాగడానికి నీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉపాధి కూలీలను సమీకరించి మే నెల 22వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
