మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..
తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు..

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ 10 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న దళిత మహిళా మాలజయలక్ష్మి షెడ్డు ని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో నిత్యానందయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి అండగా నిలబడి రాష్ట్రంలో మాలమహానాడు తరఫున ర్యాలీలు ధర్నాలు చేసి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చంద్రయ్య మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షులు జైభీమ్ సాయిరామ్, రాయలసీమ అధ్యక్షులు ఎం నరసప్ప , నందవరం మాల మహానాడు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆదోని మండల యూత్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజోలప్ప మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్మాల మహానాడు నాయకులు బన్నూరు అంజి నీలకంఠ ఎల్లప్ప హుసేని గిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *