News
మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..
మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..
తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు..
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ 10 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న దళిత మహిళా మాలజయలక్ష్మి షెడ్డు ని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో నిత్యానందయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి అండగా నిలబడి రాష్ట్రంలో మాలమహానాడు తరఫున ర్యాలీలు ధర్నాలు చేసి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చంద్రయ్య మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షులు జైభీమ్ సాయిరామ్, రాయలసీమ అధ్యక్షులు ఎం నరసప్ప , నందవరం మాల మహానాడు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆదోని మండల యూత్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజోలప్ప మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్మాల మహానాడు నాయకులు బన్నూరు అంజి నీలకంఠ ఎల్లప్ప హుసేని గిరి తదితరులు పాల్గొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
