Connect with us

News

వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో  వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు మొదటి నుండే ఇష్టం లేదని అనూష , శాంతరాజ్ ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలైనా  పెళ్లైనప్పటి నుండి అత్తమామలు తిక్కయ్య , లలితమ్మ తో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా అదనపు కట్నం కోసం ఆమెను వేదిస్తున్నాడని కలత చెందిన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేశారు. తల్లితండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఆదోని ఏరియా హాస్పిటల్ లో మృతురాలి బంధువులు
మృతురాలి తండ్రి హనుమంతు మాట్లాడిన వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు   యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు  కిటికీ లోంచి తలలు బయటికి  పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని  మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో
బస్సు పేపర్లు తనిఖీ చేస్తున్న అధికారులు
డ్రైవర్లు మరియు స్కూల్ యజమానులతో మాట్లాడుతున్న డిఎస్పి హేమలత
తనిఖీలు చేస్తున్న అధికారులు
Continue Reading

News

మందుబాబులపై కేసు నమోదు

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం 01 వ తేదీన  1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీరామ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి హేమలత పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిచమని ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 28 మందిపై మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో11 మంది పై మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయము కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకు తెలిపారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.38 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 74.486 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28902 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో :  2389  క్యూసెక్కులు

Continue Reading

Trending