Connect with us

News

వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో  వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు మొదటి నుండే ఇష్టం లేదని అనూష , శాంతరాజ్ ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలైనా  పెళ్లైనప్పటి నుండి అత్తమామలు తిక్కయ్య , లలితమ్మ తో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా అదనపు కట్నం కోసం ఆమెను వేదిస్తున్నాడని కలత చెందిన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేశారు. తల్లితండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఆదోని ఏరియా హాస్పిటల్ లో మృతురాలి బంధువులు
మృతురాలి తండ్రి హనుమంతు మాట్లాడిన వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మహిళా భద్రతపై అవగాహన సదస్సు

Published

on

కర్నూలు జిల్లా ఎస్పీ (SP) మరియు ఆదోని డీఎస్పీ (DSP) ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు.

మహిళలకు భద్రతపై అవగాహన కలిగిస్తున్న పోలీసులు

అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఆపద సమయంలో భయపడకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సదస్సులో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు..

మహిళలకు భద్రతపై అవగాహన కలిగిస్తున్న పోలీసులు పాల్గొన్న మహిళలు
  • డైల్ 112 (Dial 112): అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ‘డైల్ 112’ నంబర్‌ను ఎలా సంప్రదించాలో వివరించారు.
  • సైబర్ క్రైమ్: సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
  • రోడ్డు భద్రత: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు మితిమీరిన వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

​మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య

Published

on

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య.. వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆదోని సమీపంలో చోటుచేసుకుంది.

మృతుడి బంధువులతో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన మాల మల్లప్ప అనే వ్యక్తి గత కొంతకాలంగా కడుపులో గడ్డల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు అతడిని ఆదోనిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో కర్నూలులోని ఓమ్ని హాస్పిటల్ వంటి పలు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందించారని అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో మల్లప్ప తీవ్ర వేదనకు గురయి జీవితంపై విరక్తి చెందిన ఆయన, బుధవారం (18.02.2026) ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఆదోని – ఇస్వి ఆర్‌ఎస్ (Isvi RS) మధ్య రైల్వే కిలోమీటర్ నంబర్ 497/32 వద్ద డౌన్ లైన్ ట్రాక్ పై అటుగా వెళ్తున్న గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతుడి బంధువులతో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
మృతుడి ఆధార్ కార్డు

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆదోని – మంత్రాలయం రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృతదేహంని పరిశీలిసున్న రైల్వే పోలీసులు
Continue Reading

News

అదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్

Published

on

కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులని వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… అదోని పట్టణంలోని అమరావతి నగర్, మారెమ్మ అవ్వ గుడి సమీపంలో మరియు ఆంజనేయ స్వామి దేవాలయం బావాజీపేట సమీపంలో గల ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదోని వన్ టౌన్ ఏఎస్ఐ ఎం. తిరుమల నాయక్ తన సిబ్బందితో బాబాజీ పేటలో హెడ్ కానిస్టేబుల్ ఎస్. సత్తార్ వలీ అమరావతి నగర్ లో ఆకస్మిక దాడి నిర్వహించారు.

బాబాజీ పేట కు చెందిన బోయ నాగరాజు (49) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 22 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో బెంగళూరు విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్ఐ ఎం తిరుమల నాయక్ తెలిపారు.

అమరావతి నగర్ కు చెందిన బోయ రామకృష్ణ (అలియాస్ రాముడు) (52) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 16 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో 11 బాటిళ్ల ‘జాన్ ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్’ విస్కీ (180 ML), 05 బాటిళ్ల ‘మెక్ డోవెల్స్ నంబర్ 1 లగ్జరీ సుప్రీం’ విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని :నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలీ తెలిపారు.

Continue Reading

Trending