Connect with us

News

ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే

Published

on

ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.
వివరాల్లోకెళ్తే ఆరెకల్ గ్రామానికి చెందిన యోహోను జనవరి రోజు బాణాలు సంచారాలు కలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలు కావడంతో కర్నూల్ లో చికిత్స పొందు తూ 8వ తేదీ మృతి చెందినాడు అతనికి భార్య జయమ్మ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన చేతుల మీదగా ఇంటి పెద్ద జయమ్మకు అందజేశారు.

News

ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి

Published

on

ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

మానసికరం చేస్తున్న నూతనంగా ఎన్నికైన రెవెన్యూ శాఖ అధికారులు

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:

  • ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
  • అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
  • సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
  • ట్రెజరర్: రాఘవేంద్ర
  • వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
  • జాయింట్ సెక్రటరీ: మహేష్
  • ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
  • స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య
ఎన్నికల నిర్వహిస్తున్న ఫోటో

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఎన్నికైన అధికారుల గ్రూప్ ఫోటో
Continue Reading

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

Trending