Connect with us

News

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

Published

on

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.
96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:
నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)
ఉదయం
7.00 – నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం.
8.50 – మండ్లెం గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.15 – తంగడంచ గ్రామంలో స్థానికులతో సమావేశం.
10.55 – తంగడంచలో బిసి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.
11.55 – తంగడంచలో భోజన విరామం
సాయంత్రం
4.00 – తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – జూపాడుబంగ్లాలో తాండవ సామాజికవర్గీయులతో సమావేశం.
4.50 – ఎబిఎన్ చర్చిలో క్రిస్టియన్లతో సమావేశం.
5.10 – తాటిపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
5.50 – తరిగొప్పుల క్రాస్ వద్ద బిసిలతో సమావేశం.
6.15 – బన్నూరు వద్ద స్థానికులతో సమావేశం.
6.40 –బన్నూరు శివారు విడిది కేంద్రంలో బస.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరణ.

నంద్యాల జిల్లా. 10వ తేదీ కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర బుధవారం 95వ రోజుకు చేరుకుంది.  నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకం.

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తయిన సందర్భంగా  నారా లోకేష్
అల్లూరులో హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి హామీ ఇస్తూ  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నందికొట్కూరు బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్ గారు పేదలు తమ గళం వినిపించే వేదిక యువగళం అని అన్నారు

యువగళం పాదయాత్ర 1200 కి.మీ. పూర్తి.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending