Connect with us

News

చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత కార్మికులకు వైయస్సార్ నూతన నేస్తం పథకం ద్వారా రూ. 24 000/- చొప్పున ఐదు సంవత్సరాలుగాను రూ 1.20 వేలు అందించడం జరుగుతుంది గత చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినాడు గత రాజశేఖర్ రెడ్డి హయం నుంచి నిరుపేద చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు మంజూరు చేయించి పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, చేదోడు వైయస్సార్ చేయూత అన్ని పథకాల కూడా నేరుగా డబ్బులు వారి అకౌంట్లోనే వేయడం జరుగుతుంది అని తెలిపారు. 2024 లో కూడా కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇది ప్రజల ప్రభుత్వం అలాగే ఆదోనిలో టీడీపి నిరుద్యోగ నాయకులు టిడ్కో గృహాలపై విమర్శలు చేయడం సరికాదు మొదటి విడత టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ తాళాలు అప్పగించడం జరిగింది త్వరలో చిన్నపాటి సమస్యలు ఉన్న సర్దుబాటు చేసి గృహాలకు చేరుస్తాం కచ్చితంగా నా ఆదోని ప్రజలకు గృహాలను అప్పగించి తీరుతా నా ఆదోని ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నారు. ఈరోజు చేనేత కార్మికులకు మగ్గం వేయడానికి యంత్ర పరికరాలను అప్పగించడం జరిగింది త్వరలో చేనేత కార్మికులకు 3 సెంట్లు నివాస స్థలమును ఇవ్వడానికి కృషి చేయాలని కలెక్టర్ కు విన్నపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, చేనేత శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జి.రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తాసిల్దార్ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending