Connect with us

News

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

Published

on

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు
■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..
■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..
■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు.

అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ
అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ

హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి ప్రమాదకరమైన కెమికల్స్ మరియు అపరిశుభ్ర వాతావరణంలో మురుగు నీటితో పేస్ట్ తయారు చేస్తున్నరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకరమైన కెమికల్స్ ని కూడా కలుపుతున్నట్లు గుర్తించారు ఎస్ ఓ టి పోలీసులు. 2 సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నరు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్నరు నిర్వాహకులు. ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్టు చేసిన విచారణ చేపట్టా అధికారులు. ఇటువంటి కల్తీ పేస్టులను తయారు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు

News

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

Published

on

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో పూజకు వెళ్తున్న ఫోటో

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి,  చీరలతో  సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం  ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.  చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి  కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.

కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తాన్న ఫోటో
రథి మన్మధుల దేవుళ్ల
Continue Reading

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Trending