Connect with us

News

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

Published

on

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు
■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..
■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..
■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు.

అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ
అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ

హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి ప్రమాదకరమైన కెమికల్స్ మరియు అపరిశుభ్ర వాతావరణంలో మురుగు నీటితో పేస్ట్ తయారు చేస్తున్నరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకరమైన కెమికల్స్ ని కూడా కలుపుతున్నట్లు గుర్తించారు ఎస్ ఓ టి పోలీసులు. 2 సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నరు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్నరు నిర్వాహకులు. ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్టు చేసిన విచారణ చేపట్టా అధికారులు. ఇటువంటి కల్తీ పేస్టులను తయారు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

News

మహిళా భద్రతపై అవగాహన సదస్సు

Published

on

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఆదోని డి‌ఎస్‌పి శ్రీ హేమలత ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు.

మహిళలకు భద్రతపై అవగాహన కలిగిస్తున్న పోలీసులు

అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఆపద సమయంలో భయపడకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సదస్సులో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు..

మహిళలకు భద్రతపై అవగాహన కలిగిస్తున్న పోలీసులు పాల్గొన్న మహిళలు
  • డైల్ 112 (Dial 112): అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ‘డైల్ 112’ నంబర్‌ను ఎలా సంప్రదించాలో వివరించారు.
  • సైబర్ క్రైమ్: సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
  • రోడ్డు భద్రత: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు మితిమీరిన వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

​మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending