వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.
మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారికి సహకరించండి. మీ యొక్క కష్టార్జితాన్ని దొంగల పాలు కాకుండా కాపాడండి. పట్టణంలో దొంగతనాలు జరగకుండా పోలీసు వారితో కలిసి భాగస్వామ్యం కండి అని పిలుపునిచ్చారు ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *