News
మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య

తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కుటుంబ సభ్యులను విచారిచాగా సుమారు 14 సం.ల నుండి ఆదోని టౌన్ లోని చందా సాబ్ దర్గా ఇనాం స్తలమ్ లో షెడ్ వేసుకోసి అందులో సప్లయర్ షాప్ మరియు జిరాక్స్ షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడని షాప్ ప్రక్కలో స్వంత ఖర్చులతో ఇంకొక షెడ్ కట్టించి దాన్నిని ఎరువుల అంగిడ్ వాళ్లకు ఇచ్చినాడని, అలాగే ఒక స్సం., క్రితం అదే దర్ఘ స్తలంలో ఉన్న ఒక హోటల్ ను తమిళనాడు వాళ్ళ నుండి 8 లక్షలకు కొనగా అపుడు దర్గా వాల్లు ఎలా కొంటావని, ఒక లక్ష ఇచ్చి ఖాలీ చేయించి నారని, అలాగే సుమారు 8 నెలల నుండి రాము నుండి బాడిగ తీసుకోకుండా రాము ఉన్న షాప్ ఖాలీ చేయాలనీ ఒత్తిడి చేసినారని , అందుకు రాము అతని కుటుంబ సబ్యులు ఎంత వేడుకున్నా వాళ్లు వినలేదని పోలీసులకు బంధువులు తెలిపారు. మరల రాము షాప్ వద్దకు వచ్చిఖాలీ చేయండి లేకపోతే ఎక్కడికైనా పోయి చావండి అని చెప్పినారని, అందుకు రాము మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోన్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదోని రైల్వే SI రామస్వామి దర్యాప్తు చేసి section 306 r/w 34 IPC గా మార్చి సదరు దర్గా హక్కు దారులైన పాన్ షాప్ సలాం , చోటు @ సలీం లపై కేసు నమోదు చేశారు.
News
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీ లోంచి తలలు బయటికి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.



News
మందుబాబులపై కేసు నమోదు

కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం 01 వ తేదీన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీరామ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి హేమలత పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిచమని ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 28 మందిపై మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో11 మంది పై మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయము కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకు తెలిపారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.38 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 74.486 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28902 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2389 క్యూసెక్కులు
-
News3 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News23 hours ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025
-
News3 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News4 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ