News
సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న అధ్యక్షతన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో AOకి వినతిపత్రం ఇవ్వాలని ఆయన్ని పిలువగా ఏవో నిర్లక్ష్యంగా ఉండడం వలన సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగడం జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం తలుపులకు వినతి పత్రాన్ని అతికించరు. అధికారులకు కనీసం వినతిపత్రం తీసుకునే తీరిక కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు దస్తగిరి, శ్రీరాములు, సురేంద్ర, ఆదోని మండల అధ్యక్షులు రంగనాథ్, దేవనకొండ మండల కార్యదర్శి భాషా, ఆస్పరి మండల కార్యదర్శి రామాంజనేయులు, పెద్దకడూబురు మండల, తుగ్గలి మండల అధ్యక్షులు రంగరాజు అధ్యక్షులు హనుమంతు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ తిప్పన్న ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, కోసిగి మండల సిఐటియు నాయకులు రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం స్థానిక మండల నాయకులు గోవిందు, రహిమాన్, రామప్ప రైతు సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి, హనుమంతు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
